రాష్ట్రాన్ని బొందలగడ్డగా మార్చారు
టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి
గజ్వేల్: టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధత వల్ల రైతు ఆత్మ హత్యలతో తెలంగాణ బొందలగడ్డగా మారిందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపోరు’ బహిరంగసభలో రేవంత్రెడ్డి మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణ ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉందని, ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో తెలియజేసిందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోను భగవధ్గీత, ఖురాన్, బైబిల్ అంటూ అభివర్ణించి ఇప్పుడు పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.