కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: రైతులకు దొంగల్లా బేడీలు వేసి తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేత రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మద్దతు ధర అడిగిన రైతులపై పోలీసు జులుంపై ఆయన సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. గిట్టుబాటు ధరలు అడిగినందుకు రైతులపై రాజద్రోహం కేసులు పెట్టడం ఘోరమన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లటం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో వలస పాలకులు కూడా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడలేదు. రైతు కంటనీరు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.