ఖని ఆస్పత్రిలో ప్రసవాల రికార్డు


గోదావరి ఖని: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో పది మందికి పురుడుపోశారు. పుట్టిన 10 మంది శిశువులూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరిండెంటెండ్‌ గైనకాలజిస్ట్‌ సూర్యశ్రీ తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది దాదాపు 15 మంది కలిసి తాము ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశామని ఆమె తెలిపారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top