టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్

టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్ - Sakshi


నటి రాధిక ఆప్తే గుర్తుందా? తమిళంలో ధోని, అళగురాజా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో కథానాయికిగా చేసింది. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ కథానాయకులు, దర్శకనిర్మాతలపై విరుచుకు పడుతోంది. ఈ మధ్య తన అశ్లీల దృశ్యాలు వెబ్‌సైట్స్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేయడంతో కంగుతిన్న రాధిక ఆప్తే ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరిపై ఏం అనుమానం ఉందో తెలియదు గానీ ఈ బదలాపూర్ అమ్మడు టాలీవుడ్ సినీ వర్గాలపై రుసరుసలాడుతోంది.



అక్కడి కొందరు దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవమే లేదంటూ దుమ్మెత్తి పోస్తోంది. కథానాయకుల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తున్నట్లు తెలిపింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి అక్కడంత సీన్ ఏమీలేదు. ఆమె ఫైర్ అవ్వడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉంటుందనే భావన వినిపిస్తోంది. కోలీవుడ్‌లోనూ అవకాశాలు లేని రాధిక ఆప్తే ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్‌పై సారిస్తోంది.అన్నట్టు ఈ భామ ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోందన్నది గమనార్హం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top