రామడుగులో సైకో హల్‌చల్


రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో ఓ వ్యక్తి స్థానికులకు హడలు పుట్టించాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ దుండగుడు కత్తి చేతబట్టుకుని అటుగా వెళ్తే వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. రెండు బస్సులను, మూడు కార్లను అడ్డుకుని అద్దాలు పగులగొట్టాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఉన్మాదంతోనే ఈ చర్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. అతని గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top