మాకు న్యాయం చేయండి
టేక్మాల్లో ఎమ్మెల్యే బాబూమోహన్ కాన్వాయ్ని అడ్డుకున్న బాధితులు
టేక్మాల్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నగేష్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాబుమోహన్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. సోమవారం టేక్మాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవానికి సుడిగాలి పర్యటన చేశారు. కేసును పోలీసులు నీరు గారుస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్కి అడ్డురాగ నాయకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి ఆందోళన కారుల్ని చెదరగొట్టారు. అంతకు ముందు మృతుడి భార్య బబితతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసు విచారణ పూర్తయిన తర్వాత న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
మూడేళ్లకు గుర్తొచ్చామా..
తమ గ్రామంలో తాగెందుకు గుక్కెడు నీళ్లు లేకున్నా ఎం అభివృద్ది చేస్తున్నారని మండలంలోని కాద్లూర్ గ్రామంలో పలువురు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆరోపించారు. గ్రామానికి చెందిన సుభాష్ ఎమ్మెల్యేకు మూడెళ్ల తర్వాత గ్రామం గుర్తుకు వచ్చిందా..? ఎమి అభివృద్ది పనులు చేయనిది గ్రామానికి ఎందుకు రావడం ఆరోపించారు. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. అక్కడకు పార్టీ నాయకులు, పోలీసులు చేరుకొని ఆయనను దూరంగా నెట్టివేశారు.