'ప్రజల బతుకులు మారాలి'
తూప్రాన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో తూప్రాన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే నాయకులు బాగుపడటం కాదు.. ప్రజల బతుకులు మారాలి అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ఈనెల 3వ తేదీన హైదరాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు.