'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని విస్పర్ వ్యాలీలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో మరణించిన విషయం తెలిసిందే.