ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో విషాదం

ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో విషాదం - Sakshi


నిజామాబాద్‌: సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు గానీ, కొత్త సినిమా గానీ వచ్చిందంటే ముందుగా సందడి చేసేది  హీరో అభిమానులే. తమ హీరో పుట్టినరోజుంటే తమ పుట్టినరోజు కంటే ఎక్కువగా వేడుకులు జరుపుకుని ఆనందపడుతుంటారు అభిమానులు. అదే తరహాలో నిజామాబాద్‌ జిల్లాలో ఓ హీరో పుట్టినరోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆదివారం (అక్టోబర్‌ 23న) బాహుబలి, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్‌లోని అభిమానులందరూ అతని జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.



ఈ వేడుకల సందర్భంగా అభిమానుల్లో ఒకడైన ప్రశాంత్‌ (19) అనే యవకుడు తన అభిమాన హీరో ఫ్లెక్సీని కడుతుండగా ఆకస్మాత్తుగా విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ తగిలింది. విద్యుత్‌ షాక్‌తో అభిమాని ప్రశాంత్‌ అక్కడిక్కడే మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top