జగన్‌ ‘రాజధాని’ పర్యటనపై రాజకీయం

జగన్‌ ‘రాజధాని’ పర్యటనపై రాజకీయం - Sakshi

  • పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు

  • బాబు ఆదేశాలతో రైతులను బుజ్జగిస్తున్న మంత్రులు

  • సాక్షి, అమరావతి బ్యూరో:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రాజధాని ప్రాంత పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశా లతో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు గ్రామాల బాట పట్టారు. రెండే ళ్లుగా రాజధాని ప్రాంత రైతులకు కని పించ కుండా ముఖం చాటేస్తున్న మంత్రులు, టీడీపీ నాయకులు.. జగన్‌ పర్యటన నేపథ్యంలో రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణం పేరుతో పలుహామీలిచ్చి రైతుల భూముల్ని లాక్కున్న ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా గాలికొదిలే సింది. రైతుల వద్ద మిగిలిన ఉన్న భూముల్నీ లాక్కునేందుకు ప్రభుత్వం భూ సేకరణ నోటిí ఫికేషన్‌ జారీ చేస్తోంది. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న విపక్ష నేత జగన్‌ వారికి అండగా నిలిచేందుకు 19న రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.  



    గజం భూమి కూడా ఇవ్వం..

    వైఎస్‌ జగన్‌ పర్యటించనున్న గ్రామాల్లో మంత్రులు, అధికారులు రైతులతో చర్చలు జరిపారు. సచివాలయంలో మంగళవారం సమావేశమైన మంత్రులు నారాయణ, ప్రత్తి పాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, స్థానిక నాయకులు సాయంత్రం 3.30కి లింగాయపాలెం చేరుకున్నారు. లంక భూము లకు చెందిన కొందరు రైతులను పిలిపిం చారు. సాగు భూములకు పరిహారంగా ఇచ్చింది తీసుకోవాలని చెప్పడం అన్యాయ మని రైతులు వాపోయారు. ‘‘మేము మీ కోసం రాలేదు. అవన్నీ సీఎంతో మాట్లాడి చెబుతాం’’ అని మంత్రులు చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఎన్నికల్లో మీకు ఓట్లు వేస్తే మాకు చేసే న్యాయం ఇదేనా? మీ పార్టీని నమ్మినందుకు ఇదా చేసేది? పిలిపించి అవమానిస్తారా? గజం భూమి కూడా ఇవ్వం. ఏం చేస్తారో చేసు కోండి’’ అంటూ లంక రైతులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న మంత్రులు రైతులను మభ్యపెట్టేందుకు లంక భూముల్లో పర్యటించారు.



    రైతులకు పోలీసుల హెచ్చరికలు

    రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, సభలు, సమావేశాలు నిర్వహించు కోవడానికి వీల్లేదని రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తు న్నారు. లింగాయపాలెంలో వైఎస్‌ జగన్‌  రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు స్థలాన్ని ఇవ్వొద్దంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు మరో స్థలాన్ని పరిశీలిస్తుండగా పోలీసులు మూకుమ్మడిగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మీడియా ప్రతినిధులు ఉండటంతో కొద్దిసేపు వేచి చూసి వెళ్లిపోయారు. జగన్‌ ఎక్కడెక్కడ పర్యటిస్తారు? రూట్‌ మ్యాప్‌ ఏంటి? అంటూ స్థానిక టీడీపీ నేతలు రెండు రోజులుగా ఆరా తీస్తుండటం గమనార్హం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top