బార్లపై పోలీసుల దాడులు


సాక్షి, ముంబై: నగర సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్‌ఎస్‌బీ) పోలీసులు శనివారం తెల్లవారుజామున నగరంలో పలు బార్లపై దాడులు నిర్వహించారు. ధారావిలోని డిస్కవరీ బార్‌పై దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21,650 నగదును సీజ్ చేసి ధారావి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బైకల్లాలోని కోబనా బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించి దాదాపు 13 మందిని అరెస్టు చేశారు. ఇక్కడ రూ.24,000 నగదును స్వాధీనం చేసుకుని బైకల్లా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top