ప్రజల ఇక్కట్ల పరిష్కారానికి వర్కింగ్ గ్రూపు


 న్యూఢిల్లీ: ప్రజల ఇక్కట్ల పరిష్కారం కోసం అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సికి భారతీయ జనతా పార్టీ విన్నవించింది. తమ తమ స్టేషన్‌ల పరిధిలో తీవ్రస్థాయి నేరాలు జరిగితే అందుకు ఆయా స్టేషన్ హౌస్ అధికారుల (ఎస్‌హెచ్‌ఓ)లను కచ్చితంగా బాధ్యులను చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు కమిషనర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సతీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజల ఈతిబాధల పరిష్కారం కోసం తక్షణమే ఓ అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

 

 ఇందులో ఆయా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఎస్)లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను సభ్యులుగా తీసుకోవాలి. దీంతోపాటు ఆయా వర్తక సంఘాలకు చెం ది న  ప్రతినిధులను కూడా అందులో సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ వర్కి ంగ్ గ్రూపు కనీసం నెలకొకసారి కచ్చితంగా సమావేశం కావా లి. ఆయా పోలీస్ స్టేషన్‌లలో కొలి క్కిరాని కేసులను ఈ గ్రూపు ... పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’ అని అన్నారు. దీంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఠాణా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top