‘గ్రామాల్లో ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారు బాబు?’

‘గ్రామాల్లో ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారు బాబు?’ - Sakshi


కర్నూలు: బ్యాంకుల నుంచి డబ్బుల విత్‌ డ్రా చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. బ్లాక్‌ మనీ వెలికితీతకు సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు కేంద్రం దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



దేశంలో 92శాతం గ్రామాలకు బ్యాంకింగ్‌ సదుపాయాలు లేవని అన్నారు. అలాంటప్పుడు నగదు రహిత లావాదేవీలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయాలంటూ సూచనలు చేస్తున్నారని, గ్రామాల్లోని వారికి ఎవరు ట్రైనింగ్‌ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top