ఎంజీఎంలో నర్సింగ్ స్టూడెంట్స్ ఆందోళన
వరంగల్ అర్బన్: వరంగల్ ఎంజీఎంలో స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నరగా స్టైఫండ్ రావటం లేదంటూ నర్సింగ్ విద్యార్థినులు నిరసనకు దిగారు. బుధవారం వారు విధులు బహిష్కరించి ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. తమకు ఉన్న అన్ని సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.