కొత్త పెళ్లికూతురు అనుమానాస్పద మృతి
ఏటూరు నాగారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కొత్త పెళ్లి కూతురు అనుమానాస్ప స్థితిలో మృతి చెందింది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ప్రేమజంట నెలన్నర క్రితం ఇక్కడే పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు. కాగా నవ వధువు సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందింది. వివరాలు.. పశ్చిమబెంగాల్కు చెందిన గోపి, దాస్ సోమా (22) ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో.. ఏటూరునాగారం చేరుకొని పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు.
అయితే రెండు నెలలు తిరక్కుండానే దాస్ సోమా మృతిచెందింది. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని.. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. చుట్టుపక్కల వారు మాత్రం దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని, భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.