ఆయన సరసన నటించే ప్రసక్తే లేదు
నటుడు విక్రమ్, నటి నయనతార వీరిద్దరికి వ్యక్తిగతంగా ఎవరి ఇమేజ్ వారికుంది.అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్లో ఒక చిత్రం వస్తే చూడాలని పరిశ్రమ వర్గాల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ చాలా మందికి ఉంటుంది. అయితే అది జరిగే అవకాశమే కనిపించడంలేదు. నయనతార విక్రమ్తో నటించడానికి ససేమిరా అంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. వీరి మధ్య ఏం జరిగింది? ఎందుకు నయనతార విక్రమ్తో నటించనంటున్నారు? ఇది తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్బ్యాక్కు వెళ్లాల్సిందే. నిజానికి నయనతారకు ఆరంభకాలంలోనే విక్రమ్తో డ్యూయెట్లు పాడే అవకాశం వచ్చింది.
అప్పుడామె ఎస్జే.సూర్యకు జంటగా కళ్వనిన్కాదలి చిత్రంలో నటించడానికి అంగీకరించారు.అ సమయంలో విక్రమ్ తో నటించే అవకాశం తలుపు తట్టింది. దీంతో ముందుగా కమిట్ అయిన ఎస్జే.సూర్య చిత్రాన్ని కాదనడం ఇష్టం లేక ఆ చిత్రంతో పాటు విక్రమ్ చిత్రానికి కాల్షీట్స్ సర్ధుబాటు చేస్తానని చెప్పారు. అయితే విక్రమ్ చిత్ర యూనిట్ అలా కుదురదు మీరు విక్రమ్ చిత్రం మాత్రమే చెయ్యాలి.విక్రమ్ ఎంత పెద్ద హీరో,ఆయన మార్కెట్ ఎంతో తెలుసా?మీకు అనడంతో నయనతారకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పెద్ద హీరో, చిన్న హీరో అంటూ మీరే తారతమ్యం చూపిస్తున్నారు.
ఇప్పుడే కాదు ఎప్పుడూ నేను విక్రమ్తో నటించను అని ఖరాఖండీగా చెప్పారు. అప్పటి నుంచి విక్రమ్ నయనతారల కలయికలో చిత్రం రాలేదు. విక్రమ్ తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నయనను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయి. విక్రమ్ సరసన నటించేది లేదంటూ చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా.