జాతరలో కీలక ఘట్టం


అదిలాబాద్‌: నాగోబా జాతరలో కీలక ఘట్టమైన ప్రజా దర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో పాల్గొనడానికి గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అటవీ ప్రాంతమంతా భక్తులతో కిటకిట లాడుతోంది. కాగా ప్రజా దర్భార్‌ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top