బాబు చీటింగ్ చేస్తే మా సత్తా చూపిస్తాం : ముద్రగడ

బాబు చీటింగ్ చేస్తే మా సత్తా చూపిస్తాం : ముద్రగడ - Sakshi

ఖమ్మం : సీఎం చంద్రబాబునాయుడు చీటింగ్ చేస్తే కాపు సత్తా చూపిస్తామని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఖమ్మంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడం కోసం తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడని ఆరోపించారు.

 

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువిస్తున్నామని ముద్రగడ చెప్పారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రకటన చేయకుంటే వచ్చే నెల నుంచి తమ కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడని, తాను కులం కోసం పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ముద్రగడ చెప్పారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top