ఏ ప్రతిఫలం కోరుతున్నారో చెప్పండి
ముఖ్యమంత్రికి ముద్రగడ లేఖ
జగ్గంపేట: బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి కాపుల నుంచి ఏ ప్రతిఫలం కోరుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశంలో విడుదల చేశారు.
‘ఇద్దరు వ్యక్తులు పోటీకి దిగితే ఒకరే గెలుస్తారన్నది మీకు తెలియనిది కాదు. ఇక్కడ అలా కాదు ముఖ్యమంత్రిగారూ.. మమ్మల్ని ఓడిస్తే రెండోవారు కూడా ఓడిపోవడం ఖాయం. ఆవేశం తెచ్చుకుని గొప్పలకు పోకండి. ఈ థియరీ బాగా చదివి అర్థం చేసుకోండి. ఇటువంటి థియరీ ఏ పుస్తకాల్లోనూ చదివి ఉండరు’’ అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.