రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మృతి


చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు-నాయుడు పేట జాతీయ రహదారిపై ముంగలిపట్టు సమీపంలో ద్విచక్రవాహనాన్ని, పాల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు నీలిమ(26), కోమలి(2)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో నీలిమ భర్త, మరో కూతురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. నీలిమ తన భర్త, పిల్లలతో కలిసి కాణిపాకం వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top