అరుళ్‌నిధికి జంటగా మోనాల్

అరుళ్‌నిధికి జంటగా మోనాల్


 చిన్న గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవనుంది నటి మోనాల్. ఆ మధ్య వానవరాయనుమ్ వల్లవరాయనుమ్ చిత్రంలో కృష్ణ సరసన నటించిన ఈ మలయాళ బ్యూటీ తాజాగా నటుడు అరుళ్‌నిధితో రొమాన్స్ చేస్తోంది. ఇంతకుముందు డిమాంటి కాలనీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అదే చిత్ర హీరో అరుళ్‌నిధితో ఈ తాజా చిత్రాన్ని రూపొందనుంది. ఇది మలయాళ చిత్రం మెమొరీస్ చిత్రానికి రీమేక్.

 

 నటుడు పృథ్వీరాజ్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే హీరోయిన్ కోసం ఒరిజినల్ చిత్రంలో నటించిన మియాజార్జ్ సహా పలువురు నటీమణులు పేర్లను పరిశీలించారు. చివరికి నటి మోనాల్ గజ్జర్‌కు ఈ అవకాశం వరించింది. దీని గురించి ఈ కేరళ కుట్టి తెలుపుతూ అరుల్‌నిధి సరసన తాను నటించనున్నట్లు చెప్పింది. చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 25 ప్రారంభం కానుందని అదే రోజు ఫొటోషూట్‌లో తాను పాల్గొననున్నానని తెలిపింది. ఈ చిత్రం ఒరిజినల్‌లో ఇద్దరు హీరోయిన్లు నటించారు. తమిళంలో మరో హీరోయిన్ కోసం నటి నిక్కి గల్రాణిని చిత్ర యూనిట్ అప్రోచ్ అయినట్లు తెలిసింది. అయితే ఆమె ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని సమాచారం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top