ఆదిలాబాద్‌లో అర్ధరాత్రి దుండగుల హల్‌చల్‌


ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దుండగులు హల్‌చల్‌ చేశారు. ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, రవీంద్రనగర్‌, శాంతినగర్‌, ద్వారకానగర్‌లలో ఇళ్ల ముందు పార్క్‌చేసి ఉన్న కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top