హైదరాబాద్ బయలుదేరిన మంత్రి పోచారం
తిరుమల: తిరుమలలో అస్వస్థకు గురైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఆయన వెంట టీటీడీ ఓ వైద్యబృందాన్ని హైదరాబాద్కు పంపింది. ప్రస్తుతం పోచారం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయనను తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న అపోలో వైద్యులు ఆస్పత్రికి వెళ్లి మంత్రికి చికిత్స అందించారు. ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి అతిథి గృహానికి చేరుకున్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు.