జీడిమెట్ల పారిశ్రామికవాడలో కేటీఆర్ పర్యటన
మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం పర్యటించారు. ఆప్ల్యూయంట్ ట్రిట్మెంట్ ప్లాంట్లో మంత్రి తనిఖీ చేశారు. ప్లాంట్ నిర్వహణను పరిశీలించారు. అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నమూనాల సేకరణ విధానంపై మంత్రి అసంతృప్తి వ్యక్తి చేశారు. అధునాతన రక్షణ పద్దతులు వినియోగించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కేటీఆర్ వాటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.