కేసీఆర్‌కు పేరొస్తదనే.. అడ్డుకుంటున్నరు

కేసీఆర్‌కు పేరొస్తదనే.. అడ్డుకుంటున్నరు - Sakshi


రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌



హుస్నాబాద్‌/సిద్దిపేట జోన్‌:
ప్రాజెక్టులను పూర్తి చేసి పంట పొలాలకు నీరందిస్తే సీఎం కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తదోనని కొన్ని పార్టీలు కోర్టుకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకుంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అడ్డుకున్నా ఫర్వాలేదు, కొంత ఆలస్యం అవుతుందే తప్పా చివరకు ప్రభుత్వమే గెలుస్తుందన్నారు.



బుధవారం బహిరంగ మలమూత్రరహిత గ్రామంగా ప్రకటించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు కేటాయించామని హరీశ్‌రావు చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top