గండీడులో మూకుమ్మడి రాజీనామాలు


మహబూబ్నగర్ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలమూరు జిల్లా గండీడు మండలంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 

 

గండీడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గండీడు మండలాన్ని వెంటనే వికారాబాద్ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఎంపీటీసీలు, సర్పంచ్లు వినతి పత్రం సమర్పించారు.

 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top