ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
చర్ల: మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తున్న ఇద్దరు మావో సానుభూతిపరులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెకటాద్రిపాలెంలో ఇద్దరు వ్యక్తులు మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మండలంలోని బూరుగుపాడుకు చెందిన మడలి జోగయ్య, మడలి జోగ అనే ఇద్దరు ఏరియ కమిటీకి సానుభూతిపరులుగా పని చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
సంబంధిత వార్తలు