సల్మాన్ హీరోగా మణిరత్నం చిత్రం

సల్మాన్ హీరోగా మణిరత్నం చిత్రం - Sakshi


చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అక్టోబర్ 6వ తేదీన ఆ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.  ఆ చిత్రంలో హీరోగా ప్రముఖ మళయాల నటుడు మమ్ముటీ కుమారుడు డెల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పీసీ శ్రీరామ్ పని చేయనున్నారు.


దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి అఖరి చిత్రం. మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిత్య మీనన్ నటిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top