నా కోరిక తీరలేదు..అందుకే చంపా

నా కోరిక తీరలేదు..అందుకే చంపా - Sakshi


నా సంపాదనతో బతుకుతూ, నన్ను పురుగులా చూసేవారు

పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేయమన్నాను

మహిళ, ముగ్గురు కూతుళ్లను చంపిన నిందితుడి వాంగ్మూలం


 

 కేకే.నగర్: ‘‘నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో పాండియమ్మాళ్, ఆమె కుమార్తెలు బతికేవారు. ఆమె నాకు భార్య కాదు. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలగడంతో ఆమె కూతురు పవిత్రను ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే అందుకు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఆమె నన్ను ఇంటికి రానిచ్చేది కాదు. ఇటీవల ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో నా కోరిక తీరేది కాదు.

 

 నా సంపాదన మొత్తం తీసుకుని నన్ను పురుగును చూసినట్లు చూసేది. దీంతో ఆమెపై కోపంతో ఇనుప కమ్మితో బాది చంపాను. అడ్డు వచ్చిన ఆమె ముగ్గురు కూతుళ్లను చంపి శవాలతో మూడు రోజులు అదే గదిలో గడిపి వాసన రాకుండా ఫినాయిల్ చల్లి పా రిపోయాను’’ అని సహజీవనం సాగించన మహిళను ఆమె కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేసిన కిరాతకుడు చిన్నరాజ్ పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలం. తనను బానిసగా చూసిన మహిళను కోపంతో ఆమె కుమార్తెలను హత్య చేసినట్లు అతడు నేరం అంగీకరించాడు.

 

 చెన్నై రాయపేట పోలీసుస్టేషన్ సమీపంలో ముత్తువీధిలోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న పాండియమ్మాల్ (38), కుమార్తెలు పవిత్ర (19), పరిమళ (18), స్నేహ (16) ఇటీవల హత్యకు గురయ్యారు. మొదటి భర్తను వదిలేసి పాండియమ్మాల్, చిన్నరాజ్(35)తో కలిసి చెన్నైలో సహజీవనం సాగిస్తూ నివాసముంటోంది. ఇటీవల పాండియమ్మాళ్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఇచ్చిన ఫిర్యాదుతో వారు హత్యకు గురైనట్లు విచారణలో తెలిసింది.

 

 చిన్నరాజ్ కనిపించకపోవడంతో పోలీసులు అతన్ని వెతికి పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. ఆమె మొదటి కూతురు పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయమని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించి అతన్ని ఇంటికి రానివ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన చిన్నరాజ్ ఆమెతో పాటు ముగ్గురు కూతుళ్లను ఇనుప కమ్మితో బాది హత్య చేశాడు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top