మంచిర్యాల జిల్లాలో లారీ బీభత్సం


తాండూరు: మంచిర్యాల జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బొగ్గులారీ అదుపుతప్పి రెండు ఎడ్లబండ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు నాలుగు ఎడ్లు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని తాండూరు మండలం మాదాపూర్‌ చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top