ట్రాన్స్ఫార్మర్ దించుతుండగా..
ఖానాపూర్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దించుతుండగా.. ప్రమాదవశాత్తు మీదపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మణ్(20) అనే యువకుడు ట్రాక్టర్ పై నుంచి ట్రాన్స్ఫార్మర్ను దించుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పట్టుతప్పి మీదపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.