గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా..

గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా.. - Sakshi

అరకు: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన యువకుడు హైటెన్షన్‌ వైర్లు తాకడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులో సోమవారం జరిగింది. జాన్‌ అనే బీటెక్‌ విద్యార్థి సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి అరకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ దిగడానికి యత్నిస్తూ.. తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top