రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


- మహిళకు గాయాలు

 

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఒరిస్సా వైపు వెళ్తోన్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. వసంత అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వసంతను చికిత్స నిమిత్తం వైజాగ్‌లోని కేజీహెచ్‌కు తరలించారు. సాలూరు మండలం పెద్దపదంలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top