ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


కొల్చారం(మెదక్): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘన్‌పూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పుల్లబోయిన దుర్గేష్(32) గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top