ఇదే రోజున ఆ నగరం ప్రేమలో పడింది

ఇదే రోజున ఆ నగరం ప్రేమలో పడింది


ఢిల్లీ: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 14) ఢిల్లీ మహానగరం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేమలో పడిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, ఆఫ్ల బంధం శాశ్వతమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఏర్పడి ఆదివారం నాటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.



ఏడాది పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఢిల్లీలో ఆప్ ర్యాలీ నిర్వహించనుంది. పలు పథకాలను ప్రకటించే అవకాశముంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు.. ఏడాది పాలనలో కేజ్రీవాల్ సర్కార్ చేసిందేమీ లేదని, పూర్తిగా విఫలమైందని విమర్శించాయి. ఆప్ సర్కార్పై ఈ రోజును నిరసన దినంగా బీజేపీ ప్రకటించింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top