'డబుల్’ ఇళ్ల నిర్మాణంలో విజన్ ఉంది
జగిత్యాల: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారనీ, 2 లక్షల ఇళ్ల నిర్మాణం ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, మండలాలకు సంబంధించిన గ్రామాల డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.