దిగ్విజయ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ


హైదరాబాద్‌: టీ కాంగ్రెస్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. సోమవారం ఉదయం హోటల్‌ పార్క్‌ హయత్‌ లో భేటీ అయిన వారు ఇటీవల పరిణామాలపై వివరణ ఇచ్చినట్టు సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్‌ తో భేటీ అనంతరం దిగ్విజయ్‌ గాంధీభవన్‌ కు వెళ్లకుండానే పరిగి వెళ్లారు. మధ్యాహ్నం పరిగిలో జరిగే పార్టీ జన ఆవేధన సమ్మేళన సభలో దిగ్విజయ్‌ పాల్గొంటారు. అయితే దిగ్విజయ్‌ గాంధీభవన్‌ కు రాకపోవడంతో పలువును సీనియర్లు నిరాశ చెందారు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top