కువైట్లో కరీంనగర్వాసి మృతి
కమలాపూర్: కువైట్లో కరీంనగర్ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన గూళ్ల కుమారస్వామి (38) ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారినపడిన ఆయన మృతిచెందారు. ఆయన భౌతిక కాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు