తెలుగు టీచరైన ఉపముఖ్యమంత్రి
వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ ప్లీనరీ కోసం నిధులు సేకరించడానికి అధికార పార్టీ నాయకులు వినూత్న కార్యక్రమాలు చేపడుతుండగా.. ఉప ముఖ్యమంత్రి మాత్రం తనకు నచ్చిన పాత్రలోకి పరాకాయ ప్రవేశం చేశారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూళ్లో బుధవారం ఉపాధ్యాయుడి అవతారం ఎత్తిన కడియం శ్రీహరి పదో తరగతి విద్యార్థులకు తెలుగు క్లాస్ తీసుకున్నారు. చందస్సులో భాగంగా లఘు, గురువుల గురించి బోధించారు. మంత్రి బోధనను చూసిన స్థానిక ఉపాధ్యాయులు, అధికారులు ఆయన బోధన శైలికి విస్తుపోయారు.