అన్మోల్ రతన్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్కు ఢిల్లీకోర్టు 14రోజలు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని కస్టడీకి కోరకపోవడంతో అన్మోల్ ను జైలుకు తరలించారు. కాగా అన్మోల్ రతన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతడికి వైద్య సదుపాయాలు అందించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా జైలు అధికారులను ఆదేశించింది. కాగా ఈ నెల 20న అన్మోల్ రతన్ హాస్టల్ గదిలో అత్యాచారానికి పాల్పడినట్లు పీహెచ్డీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నిన్న రాత్రి అతడు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
కాగా సినిమా సీడీ కావాలని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పీహెచ్డీ విద్యార్థినికి...ఆ సినిమా సీడీ తన వద్ద ఉందని రతన్ మెసేజ్ పెట్టాడని.. అది తీసుకునేందుకు క్యాంపస్లోని బ్రహ్మపుత్ర హాస్టల్లో రతన్ రూమ్ వద్దకు వెళ్లగా, కూల్ డ్రింక్లో మత్తమందు కలిపి ఇచ్చాడని, అపస్మారక స్థితిలో ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న అన్మోల్ రతన్ను ఏఐఎస్ఏ బహిష్కరించింది.