జీవాతో రొమాన్స్కు హన్సిక సై
నటి హన్సిక జీవాతో డ్యూయెట్స్ పాడడానికి సై అన్నారు. ఇటీవల అపజయాలతో సతమతమవుతున్న నటుడు జీవా తన తాజా చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.అలాగే హీరోయిన్ల విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరునాళ్ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ నటి నయనతారతో నటిస్తున్నారు. రామ్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.
ఇక డీకే దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్న కవలై వేండామ్ చిత్రంలో మరో క్రేజీ నటి తమన్నతో స్టెప్స్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా క్రేజీ భామ హన్సికతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారు. ఇటీవల తమిళుక్కు ఎన్1ఐ అళుత్తవుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ ప్రకాష్ రాయప్ప ద ర్శకత్వంలో జీవా నటించనున్న చిత్రంలో నటి హన్సిక ఎంపికయ్యారన్నది తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి పోకిరిరాజా అనే టైటిల్ను నిర్ణయించడం విశేషం. కారణం ఇంతకు ముందు ఇదే టైటిల్తో సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం సూపర్హిట్ అయ్యిందన్నది గమనార్హం.