విశాఖ డెయిరీ చైర్మన్ ఇంటిపై ఐటీ దాడులు

విశాఖ డెయిరీ చైర్మన్ ఇంటిపై ఐటీ దాడులు - Sakshi

యలమంచిలి: విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. యలమంచిలిలో ఉన్న ఆయన ఇంటితో పాటు ఆయన కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ రమాకుమారి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వారు ఐటీ రిటర్న్సు దాఖలు చేయలేదని చెబుతున్నారు. లెక్కలు చూపని అక్రమ ఆస్తులు ఉండవచ్చనే అనుమానంతో దాడులు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top