శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు


తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని, బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మొక్కుకున్న ప్రకారం రూ. 5 కోట్ల విలువైన స్వర్ణాభరణ కానుకలను సీఎం సమర్పించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top