మేటీ..ట్విస్ట్‌ !

మేటీ..ట్విస్ట్‌ ! - Sakshi

- తాజాగా మరోసారి తెరపైకి బాధితురాలు

- అప్పట్లో భయపెట్టి సాక్ష్యాలు తారుమారు చేశారు

- నాకు ప్రాణ హాని ఉంది : బాగల్‌కోటె పీఎస్‌లో ఫిర్యాదు 

 

బెంగళూరు: రాష్ట్ర మాజీ అబ్కారీ శాఖమంత్రి హెచ్‌.వై మేటీ కేసుకు కొత్త ట్విస్ట్‌ దొరికింది. ఆయనపై నమోదైన అత్యాచార కేసు విషయమై జరిపిన దర్యాప్తులో సీఐడీ క్లీన్‌చిట్‌ ఇచ్చినా బాధిత మహిళ మరోసారి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కారు. మరోవైపు తాజా సంఘటన వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొంటుండటం గమనార్హం. వివరాలు...హెచ్‌.వై మేటీ రాసలీలకు సంబంధించిన సీడీలు గత ఏడాది చివర్లో దేశ వ్యాప్తంగా హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీఐడీ దర్యాప్తు చేసి ఆయన ఎటువంటి తప్పు చేయలేదని క్లీన్‌చిట్‌ కూడా ఇచ్చింది. 

 

అయితే తాజాగా సదరు సీడీల్లో ఉన్న మహిళ తనపై మేటీ అనేకసార్లు అత్యాచారం చేశారని పేర్కొంటూ బాగల్‌కోటే పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీఐడీ దర్యాప్తు సమయంలో మేటీ అనుచరులు, కుటుంబ సభ్యులు తనను భయపెట్టి సాక్ష్యాలు చెప్పించారని పేర్కొన్నారు. ఇక బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు క్లుప్తంగా...‘2015 నుంచి మేటీ నన్ను అనేకసార్లు బెదిరించి అత్యాచారం చేశారు. ఎరుపు చీరలో ఉన్న నన్ను మేటీ అత్యాచారం చేసే ఘటనకు సంబంధించిన సీడీలు ప్రసారమాధ్యమాల్లో వచ్చాయి. ఇది జరిగిన తర్వాత నాకు, నా కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. నాతో బలవంతంగా ఓ కాగితంపై సంతకం చేయించుకున్నారు.

 

సీఐడీ విచారణకు రావాల్సిందిగా నాకు నోటీసులు అందాయి. అందుకు ఒక రోజు ముందు అంటే జనవరి 29న నా వద్దకు వచ్చిన మేటీ కుటుంబ సభ్యులు ఓ కాగితంపై ఉన్న ప్రశ్నలకు నాతో బలవంతంగా సమాధానాలు రాయించారు. ఆ సమాధానాలన్నీ వారికి అనుకూలంగా ఉన్నాయి.  సుమారు ఏడు నెలలు అక్కడా ఇక్కడా తలదాచుకుని ఇటీవలే నేను బాగల్‌కోటేకు వచ్చాను. ఈ విషయమై సీఎం సిద్ధరామయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మేటీ విషయం ముగిసిన అధ్యయనమన్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top