రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు


జగిత్యాల: బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. జగిత్యాల మండలంలో  జరిగిన ఈ ప్రమాదంలో మాల్యాల మండలం నూకపల్లికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. 


క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భర్త  మృతిచెందాడు. భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  బైక్‌పై ధర్మపురికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top