పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం


రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున విస్పోటకాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిల్వ ఉంచిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top