అటవీ సిబ్బందిపై తేనెటీగల దాడి


నిర్మల్: హైదరాబాద్‌ దూలపల్లి అటవీశాఖ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లక్ష్మీపూర్ అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న 60 మంది బృందంపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. 54మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top