అకాల వర్షం.. కంది రైతుకు కష్టం
అదిలాబాద్: ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలలో గురువారం ఉదయం అకాల వర్షం కురుస్తోంది. దీంతో కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంది పంటను అమ్ముకోవడానికి అదిలాబాద్ మార్కెట్కు వచ్చిన రైతులకు వరణుడు తీరని నష్టాన్ని మిగిల్చాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కందులు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా శ్రీరాంపూర్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. దాంతో ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.