'కమల్కు కొంచెం తిక్కుంది'
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న కమల్హాసన్ విమర్శలపై ఏఐడీఎంకే నేతలు, మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కమల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్హాసన్ మానసికరోగి అని అభివర్ణించారు. ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉందని తాము ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. గత కొంతకాలంగా కమల్ ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
అవినీతి, నేరాల నియంత్రణకు పళనిస్వామి సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కమల్ విమర్శించారు. ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నా ఏ ఒక్కరూ పళనిస్వామి రాజీనామా కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. ఈ క్రమంలో యూపీలోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మరణంపై అక్కడి సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామాకు విపక్షం పట్టుబడుతున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కమల్హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు