'కమల్‌కు కొంచెం తిక్కుంది'


చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న కమల్‌హాసన్‌ విమర్శలపై ఏఐడీఎంకే నేతలు, మం‍త్రులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్‌హాసన్‌ మానసిక​రోగి అని అభివర్ణించారు. ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉందని తాము ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. గత కొంతకాలంగా కమల్‌ ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.



అవినీతి, నేరాల నియం‍త్రణకు పళనిస్వామి సర్కార్‌ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కమల్‌ విమర్శించారు. ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నా ఏ ఒక్కరూ పళనిస్వామి రాజీనామా కోసం ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని నిలదీశారు. ఈ క్రమంలో యూపీలోని గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో చిన్నారుల మరణంపై అక్కడి సీఎం యోగి ఆదిత్యానాథ్‌ రాజీనామాకు విపక్షం​ పట్టుబడుతున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కమల్‌హాసన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top