ఖమ్మం జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుకు ఈడులచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని రమణ తండాలో 10 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్ల పై కప్పులు, రేకులు ఎగిరిపోయాయి. ఈదురుగాలుల ధాటికి మండలపరిధిలో తీవ్రనష్టం జరిగింది. ఖమ్మం జిల్లా పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది.